వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాయకత్వం సంక్షోభమేదీ లేదు: వెంకయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో నాయకత్వంసంక్షోభమేదీ లేదని పార్టీ అధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అటల్‌బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా కొనసాగాలని పార్టీ కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

ఈ విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు లేవని, వాజ్‌పేయి తమ ప్రధానమంత్రి అని, ప్రతి ఒక్కరూ వాజ్‌పేయిని బలపరుస్తున్నారని ఆయన అన్నారు. శుక్రవారం గౌహతి బయలుదేరిన వెంకయ్యనాయుడు కొద్దిసేపు కోల్‌కత్తాలోని ఎన్‌ఎస్‌సి బోస్‌ అంతర్జాతీయవిమానాశ్రయంలో ఆగారు. ఈ సమయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ప్రధాని వాజ్‌పేయి మాటలను మీడియా వక్రీకరించిందని ఆయనవిమర్శించారు. మీడియా కథ అల్లింది. ప్రజలు ఆనందించారు ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికలను బిజెపి ఎల్‌.కె. అద్వానీ నేతృత్వంలో ఎదుర్కుంటుందని ప్రధాని వాజ్‌పేయి ఈ నెల 4వ తేదీన చేసిన ప్రకటన పార్టీలో దుమారం రేపింది. తాము వాజ్‌పేయి నేతృత్వంలోనే వచ్చే సాధారణ ఎన్నికలను ఎదుర్కుంటామని గురువారం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. గురువారం కేంద్ర మంత్రివర్గం సమావేశమై వాజ్‌పేయి నాయకత్వాన్ని బలపరిచింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X