నాయకత్వం సంక్షోభమేదీ లేదు: వెంకయ్య
కోల్కత్తా: భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో నాయకత్వంసంక్షోభమేదీ లేదని పార్టీ అధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అటల్బిహారీ వాజ్పేయి ప్రధానిగా కొనసాగాలని పార్టీ కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ఈ విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు లేవని, వాజ్పేయి తమ ప్రధానమంత్రి అని, ప్రతి ఒక్కరూ వాజ్పేయిని బలపరుస్తున్నారని ఆయన అన్నారు. శుక్రవారం గౌహతి బయలుదేరిన వెంకయ్యనాయుడు కొద్దిసేపు కోల్కత్తాలోని ఎన్ఎస్సి బోస్ అంతర్జాతీయవిమానాశ్రయంలో ఆగారు. ఈ సమయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రధాని వాజ్పేయి మాటలను మీడియా వక్రీకరించిందని ఆయనవిమర్శించారు. మీడియా కథ అల్లింది. ప్రజలు ఆనందించారు ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికలను బిజెపి ఎల్.కె. అద్వానీ నేతృత్వంలో ఎదుర్కుంటుందని ప్రధాని వాజ్పేయి ఈ నెల 4వ తేదీన చేసిన ప్రకటన పార్టీలో దుమారం రేపింది. తాము వాజ్పేయి నేతృత్వంలోనే వచ్చే సాధారణ ఎన్నికలను ఎదుర్కుంటామని గురువారం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. గురువారం కేంద్ర మంత్రివర్గం సమావేశమై వాజ్పేయి నాయకత్వాన్ని బలపరిచింది.