వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పరగోడుపై కాంగ్రెస్ భారీ ర్యాలీ
హైదరాబాద్: కర్ణాటక చిత్రావతి నదిపై నిర్మిస్తున్నపరగోడు ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శుక్రవారం హైదరాబాద్లో భారీ ర్యాలీనిర్వహించింది. కర్ణాటక చర్యపై ప్రధాని అటల్బిహారీ వాజ్పేయికి, రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్కు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు.
సచివాలయంలోకి ప్రవేశించకుండా కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.పరగోడు ప్రాజెక్టును ఆపించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్మట్టి, తదితర ప్రాజెక్టులను కర్ణాటక చేపట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంత కాలం చేతులు ముడుచుకుని కూర్చోందని, ఇప్పుడుపరగోడు ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ రాజకీయ లబ్ధి కోసమే హంగామా చేస్తోందని ఆయనవిమర్శించారు.
Comments
Story first published: Tuesday, June 17, 2003, 23:53 [IST]