మాఫియాతో లింకుల్లేవు: శిల్పాకుటుంబం
సూరత్: అండర్ వరల్డ్ తో మాకు ఎటువంటి సంబంధాలు లేవని బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి తల్లితండ్రులు స్పష్టం చేశారు. సూరత్ కు చెందిన ఓ వ్యాపారిని బెదరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె తల్లితండ్రులు శనివారంవిలేకరులతో మాట్లాడారు. శిల్పా పరువును దెబ్బతీసే ప్రయత్నించేందుకు కొన్ని శక్తుల ప్రయత్నిస్తున్నాయని వారు ఆరోపించారు. ప్రఫూల్ శారీస్ కంపెనీ యజమాని ప్రంకజ్అగర్వాల్ ను బెదరించారని సూరత్ పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. మాఫియా నాయకుడు ఫజలూర్ రెహమాన్ సాయంతో ఆయనను బెదరించారని పోలీసులు తెలిపారు.
అయితే, తాము పరువుప్రతిష్టలు కలిగిన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చామని, తమకు ఎటువంటి నేరమయ శక్తులతో సంబంధాలు లేవని శిల్పా తల్లి సునంద శెట్టివిలేకరులకు వివరించారు. ఒప్పందం ప్రకారం పంకజ్అగర్వాల్ అడ్వర్టైజ్ మెంట్ ల నిమిత్తం రెండు కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని, కానీ ఆయన కేవలం నాలుగు లక్షలు మాత్రమేఅందచేశాడని, మిగతా మొత్తం కోసం లీగల్ నోటిసులు పంపాలనకుంటుండగా, ఆయన శిల్పా పరువు దెబ్బతీసేందుకు ఈ ఎత్తుగడ వేశాడని ఆమె ఆరోపించారు.
అయితే, పోలీసుల వద్ద రికార్డెడ్ టెలిఫోన్ సంభాషణల గురించి వారు మాట్లాడేందుకు నిరాకరించారు.కేసు కోర్టులో ఉన్నందున దాని గురించి మేమేమీ మాట్లాడలేమని సునందా శెట్టి అన్నారు.