వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్‌ దే నిజమైన డ్రామా: టీడీపీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పరగోడు విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా ఎన్డీఏ సర్కార్‌ కు మద్దతు ఉపసంహరించాలన్నసీఎల్పీ నేత వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి వ్యాఖ్యలు హాస్యస్పదంగా ఉన్నాయని టీడీపీవిమర్శించింది. డ్రామాలొద్దు..మద్దతు ఉపసంహరించుఅంటూ ఆయన చంద్రబాబుకు సూచనలు ఇచ్చేముందు ఆయన నాటకాలు ఆడడం మానుకోవాలని టీడీపీ అధికార ప్రతినిధి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆదివారంవిలేకరుల సమావేశంలో అన్నారు. పరగోడు విషయంలో కాంగ్రెస్‌ నేతలు కర్ణాటక ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నారని ఆయన ఆరోపించారు.

పాదయాత్రలు, ఇతర యాత్రలుఅంటూ కాంగ్రెస్‌ రాజకీయ డ్రామాలు ఆడుతూ ముఖ్యమంత్రిపై లేనిపోని వ్యాఖ్యలు చేయడాన్ని బట్టి కాంగ్రెస్‌ నేతల వైఖరి ఏమిటో తెలుస్తోందని ఆయన అన్నారు. వై.ఎస్‌పరగోడుపై ఒక రకంగా వ్యాఖ్యానిస్తే, ఇతర కాంగ్రెస్‌ నేతలు మరో తీరుగా మాట్లాడుతున్నారని ఆయనవిమర్శించారు.

మొత్తమ్మీద కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వానికివీరు ఇక్కడ వకాల్తా పుచ్చుకున్నట్లుగా మాట్లాడుతున్నారని, దీన్ని బట్టే వారివి రాజకీయ నాటకాలు అనిఅర్థమవుతోందని ఉమ్మారెడ్డి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X