వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌పై పోరులో గెలుస్తాం: అద్వానీ

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌ ప్రోత్సాహం ఉన్న ఉగ్రవాదంపై పోరులో భారత్‌ గెలిచి తీరుతుందని భారత ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ ధీమా వ్యక్తం చేశారు. గతంలో పాక్‌తో జరిగిన మూడు యుద్ధాల్లో గెలిచినట్లుగా ఈ యుద్ధంలోనూ గెలుస్తామని ఆయన అన్నారు.

ఉగ్రవాదంపై పోరు రెండు ప్రపంచ యుద్ధాల లాంటిది కాదని, గతంలో భారత్‌ చేసిన మూడుయుద్ధాల లాంటిది కూడా కాదని, ఇది కొత్త రకం యుద్ధమని, గత రెండు దశాబ్దాలుగా భారత్‌ ఈ యుద్ధం కొనసాగిస్తోందని, వరల్డ్‌ ట్రేడ్‌సెంటర్‌పై దాడి జరిగే వరకు మిగత ప్రపంచం తాము చేస్తున్న యుద్ధాన్నిపెద్దగా పట్టించుకోలేదని ఆయన వివరించారు.

భారత్‌తో గత మూడు సార్లు చేసిన యుద్ధాల్లో ఓడిపోయినట్లుగానే ఈ యుద్ధం చేస్తున్నవారు తప్పకుండా ఒడిపోతారని ఆయన పాకిస్థాన్‌పేరు ప్రస్తావించకుండా అన్నారు. పది రోజుల అమెరికా పర్యటన కోసం వచ్చిన అద్వానీ ఆదివారం రాత్రి భారత ప్రజల నుంచి ఉద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదులు ఎప్పుడు, ఎక్కడ దాడులు చేస్తారనేది ఎవరికీ తెలియదని, వారి నేత లేదా నేతలు ఎక్కడ దాక్కున్నారనేది కూడా తెలియదని, కృతనిశ్చయంతో మాత్రమే ఈ యుద్ధంలోవిజయం సాధించగలమని, భారత్‌కు ఆ కృతనిశ్చయం ఉన్నదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X