బిజెపి నేతను కాల్చిచంపిన వార్
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాపెద్ద కొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు బాదం శ్రీనివాసులు శెట్టినిపీపుల్స్ వార్ గ్రూప్ కు చెందిన నక్సలైట్లు కాల్చిచంపారు. బిజెపికి చెందిన శెట్టిని మంగళవారం మధ్యాహ్నం సాయుధ నక్సల్స్ గ్రామశివార్లలో చంపివేశారు. ఇదే గ్రామానికి చెందిన ఓ దళితుడి సజీవదహనం కేసులో శెట్టి భాగస్థుడు అని భావించిన నక్సల్స్ అతన్ని చంపివేసి ఉంటారని భావిస్తున్నారు.
గ్రామశివారులో కరువు పనులుపర్వవేక్షణ నిమిత్తం శెట్టి వెళ్ళగా ఈ ఘటన జరిగింది. పనులు చూసుకొని తిరిగి గ్రామానికి వస్తుండగా ముగ్గురు సాయుధులైన నక్సల్స్ ఆయనపై దాడి చేశారు. వెంట ఉన్న ఇద్దరు యువకులను బెదరించి వారు పక్కన ఉన్న ఓ బావి వద్దకు శెట్టిని తీసుకెళ్ళి చితకబాదారు.
నన్ను కొట్టొద్దు కొట్టొద్దు అని ఆయన వేడుకొన్నా వారి మరీ చితకబాది అనంతరం తపంచాతో కాల్చిచంపారని అక్కడే ఉన్న ఈ యువకులు - రాముడు,విజయబాబు- తెలిపారు. హత్యాదృశ్యాన్ని చూసి వారు అక్కడే స్పృహతప్పి పడిపోగావీరి జేబులో నక్సల్స్ ఓ చీటి పెట్టి వెళ్ళిపోయారు.