వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రైవేట్కు సచివాలయ భవనాల నిర్వహణ
హైదరాబాద్: సచివాలయ భవనాల నిర్వహణ బాధ్యతను ప్రైవేటీకరించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రభుత్వంపై భారం అధికం కావడంతో ఈ భవనాల నిర్వహణను ప్రైవేట్పరం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
సచివాలయం డి బ్లాక్ నూతన భవనాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. సచివాలయంలోని 18 శాఖలను ఈ బ్లాక్లోకి తరలిస్తారు. సచివాలయంలో వాహనాల పార్కింగ్కు తగిన స్థలం లేనందున ట్యాంక్బండ్ వద్ద గల లుంబినీ పార్క్ వద్ద భూగర్భ పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రభుత్వ కార్యాలయాలుఒకే చోట ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Wednesday, June 11, 2003, 23:53 [IST]