వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్దంకి పిఎస్‌నుపేల్చేసిన వార్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: నిషిద్ధ పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు ప్రకాశం జిల్లాలో మరోసారి విధ్వంసం సృష్టించారు. నక్సలైట్లు మంగళవారం అర్థరాత్రి అద్దంకి పోలీసుస్టేషన్‌ను పేల్చేశారు. పీపుల్స్‌వార్‌ చంద్రవంక దళం ఈ విధ్వంసానికి పాల్పడిట్లు పోలీసులు చెప్పారు.

వివరాలు ఇలా ఉన్నాయి- 50 మంది సాయుధ నక్సలైట్లు టూరిస్టు బస్సులో అద్దంకి పోలీసుస్టేషన్‌కు వచ్చారు. పోలీసు స్టేషన్‌లో ఉన్న ముగ్గురు పోలీసు కానిస్టేబుల్స్‌ను బెదిరించి ఒక గదిలో బంధించారు. పోలీసుస్టేషన్‌లోని 20 తుపాకులను టూరిస్టు బస్సులో వేసుకున్నారు. ఆ తర్వాత టూరిస్టు బస్సులో తెచ్చిన మందుగుండు సామగ్రిని పోలీసుస్టేషన్‌లో పెట్టి పేల్చేశారు. ఈ పేల్చివేతలో పోలీసుస్టేషన్‌ భవనం మొత్తం ధ్వంసమైంది. కడప జిల్లా ఎన్‌కౌంటర్‌కు నిరసనగా పోలీసుస్టేషన్‌ను పేల్చివేసినట్లు నక్సలైట్లు వదిలిపెట్టిన వెళ్లిన లేఖలోపేర్కొన్నారు. నక్సల్స్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఇదిలా వుంటే, నక్సల్స్‌ ప్రకాశం పెద్ద దోర్నాల సర్పంచ్‌ ఇల్లుపేల్చివేసి సర్పంచ్‌పై కాల్పులు జరిపారు. ఆస్పత్రికి తరలిస్తుండగా గాయపడిన సర్పంచ్‌ మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X