ఆల్ ఖైదాకు పాక్ సురక్షిత ప్రదేశం: అద్వానీ
చికాగో: న్యూఢిల్లీ శాంతి ప్రక్రియకు చర్యలు ప్రారంభించిన ప్రస్తుత తరుణంలోనూ ఇస్లామాబాద్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని భారత ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీవిమర్శించారు. పాకిస్థాన్ ఆల్ ఖయిదా వ్యవస్థకు సురక్షిత ప్రదేశమని ఆయన అభిప్రాయపడ్డారు.
సిద్ధాంత పరంగా, కార్యకలాపాల నిర్వహణ పరంగా అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాకిస్థాన్ ప్రధాన కేంద్రమని ఆయన అన్నారు. పాకిస్థాన్ ప్రోత్సాహంతో భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న సంస్థలకు ఆల్ ఖయిదాతో సంబంధాలున్నాయని ఆయన అన్నారు. విదేశీ సంబంధాల చికాగో మండలి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇండోనేషియా తర్వాత అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం భారతేనని, ఆల్ ఖయిదాతో సంబంధాలున్నవారెవరూ ఈ దేశంలో లేరని ఆయన అన్నారు. దీనికి కారణం భారత్ ప్రజాస్వామ్యదేశమని, ఇక్కడ ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వెల్లడించేస్వేచ్ఛ ఉన్నదని, మతపరమైన వివక్ష లేదని ఆయన అన్నారు.