వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అసమ్మతిని సహించను: గులాం నబీ
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ లో ఇప్పట్నుంచీ ఎటువంటి అసమ్మతి, అనైక్యత ఉండబోదని ఏఐసిసి రాష్ట్ర ఇన్ ఛార్జీ గులాం నబీ ఆజాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరైనా వ్యక్తులు అసమ్మతిరాగాలు ఆలాపిస్తే వారిపై 24 గంటల్లో చర్యతీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జిగా బాధ్యతలుస్వీకరించిన అనంతరం తొలిసారి రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆజాద్విలేకరులతో మాట్లాడారు. ఈ సారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడే నేతలు ఎంతపెద్దవారిపైనైనా, పలుకుబడి గల కలిగి ఉన్నా, వారిపై చర్య తప్పదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఉచితవిద్యుత్ పై ఇదమిద్దంగా వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు.
Comments
Story first published: Friday, June 13, 2003, 23:53 [IST]