ఒక తాటి మీదికి గ్రూపులు: ఆజాద్
హైదరాబాద్: వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని ఎఐసిసి కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జిగా నియమితులైన తర్వాత తొలిసారి ఆయన హైదరాబాద్ వచ్చారు. ఆయనకు శుక్రవారం బేగంపేటవిమానాశ్రయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ గ్రూపు పోటాపోటీగాస్వాగతం చెప్పారు. ఆయన ముందు బలప్రదర్శన చేశారు.
ఆయన అనంతరం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) కార్యవర్గ సమావేశంలో ప్రసంగించారు. పార్టీవిజయానికి కలిసికట్టుగా పని చేయాలని ఆయన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులకువిజ్ఞప్తి చేశారు. పార్టీని రాష్ట్రంలో ఒకతాటిపై నడిపించడానికి తాను కృషి చేస్తానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి నార చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ను రుణాంధ్రప్రదేశ్గా మార్చారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు ఈ సమావేశంలో అన్నారు. పిసిసి అధ్యక్షుడిగా మూడేళ్ల కాలం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆయన చెప్పుకున్నారు.