వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధానిలో మంత్రులకు సమస్యలదండలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ చేపట్టిన జనచైతన్యయాత్రలో భాగంగా రెండో రోజు మంత్రులు కె.విజయరామారావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ లు శుక్రవారం హైదరబాద్‌ లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.వీరికి ప్రజల నుంచి అనూహ్యమైన వ్యతిరేకత వ్యక్తమైంది. ఖైరతాబాద్‌ ప్రాంతంలో పర్యటించిన మంత్రివిజయరామరావును ప్రజల నిలదీశారు. సమస్యలను ఏకరువుపెట్టి, వాటిని ఎప్పుడు పరిష్కరిస్తారో కచ్చితమైనతేదీ చెప్పాలంటూ స్థానికులు నిలదీశారు.

మూడేళ్ళల్లో తమ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందంటూ మంత్రివివరించబోగా..అవి సరే..ఇక్కడ సమస్యలకు పరిష్కారమంటూ కొంతమంది కర్కశంగా మాట్లాడడంతో మంత్రి తెల్లబోయారు.అయినా, ఆయన తేరుకొని అందరికీ ఒపిగ్గా సమాధానాలు ఇస్తూ తన యాత్రను కొనసాగించారు.

మరోవైపు, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కు ఇదే పరిస్థితి ఎదురైంది. అవును. కొన్ని చోట్ల ప్రజలు ఘాటుగా అడుగుతున్నా..మేం సహనం కోల్పకుండా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించివివరిస్తున్నామని తలసాని విలేకరులతో చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X