నేపాల్ తో సంబంధాలున్నాయి: వార్
హైదరాబాద్: ఇటీవల కాలంలో అగ్రనాయకులను కోల్పయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోన్నపీపుల్స్ వార్ గ్రూప్ తాజాగా పోలీసులకు తమ సత్తా చూపింది.ఉత్తరతెలంగాణాలోని ఒక అటవీ ప్రాంతంలో విలేకరులసమావేశం నిర్వహించి పోలీసులకు సవాల్ విసిరింది.ఒక టెలివిజన్ ఛానల్ శుక్రవారం ఆ సమావేశంవివరాలను ప్రసారం చేసింది.
ఈ సందర్భంగా వార్ అగ్రనేతమార్కపురం భాస్కరం అలియస్ చంద్రన్న మాట్లాడుతూ...పాకిస్థాన్కు చెందిన ఐ.ఎస్.ఐతో సంబంధాలున్నాయని జరగుతోన్నప్రచారం తప్పు అని చెప్పారు. ఇది పోలీసులు కుట్రఅని అభివర్ణించారు.
వారితో మాకు సంబంధాలుపెట్టుకోవాల్సిన అవసరం, అగత్యం లేదు. కాకపోతేనేపాల్ మావోయిస్ట్ లతో మాకు సంబంధాలున్నాయి.పెట్టుకోవడం కాదు ఇప్పటికే సంబంధాలున్నాయిఅనిచంద్రన్న స్పష్టం చేశారు. అగ్రనాయకత్వాన్నికోల్పయినప్పటికీ..ఉత్తర తెలంగాణాలో తాముపట్టుకోల్పోలేదని వారు ఆ ఛానల్ కు ఇచ్చినఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పోలీసుస్టేషన్ లపై మరిన్నిదాడులు చేస్తామని వారు హెచ్చరించారు.