రాజకీయ సుస్థిరత బీజేపీ వల్లే: అద్వానీ
న్యూయార్క్: గత ఐదేళ్ళల్లో బీజేపీ ప్రభుత్వంవల్ల దేశం ఎంతో ప్రగతి సాధించిందని ఉపప్రధానిఎల్.కె.అద్వానీ అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాలకాలంలో రాజకీయ సుస్థిరతను సాధించడంవల్లే ఇది సాధ్యమైందని ఆయన వివరించారు.దేశాన్ని అగ్రదేశాల సరసన చేర్చే దిశగా బీజేపీప్రయత్నిస్తోందని ప్రవాసభారతీయుల హర్షధ్వానాల మధ్యప్రకటించారు.
1988-98 మధ్య కాలంలో ఏడుగురు ప్రధానులు మారితే, గతఐదేళ్ళల్లో వాజ్ పేయి అధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వంనిలకడగా ప్రగతిని సాధిస్తోందన్నారు. శుక్రవారంన్యూయార్క్ లో భారతీయ విద్యాభవన్ ఏర్పాటు చేసినసమావేశంలో ఆయన ప్రసంగించారు. 21 శతాబ్దంభారతీయులదేనని ఆయన ప్రకటించారు.భారతీయుల ప్రతిభాసంపతి ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తోందని, ఇకమనదే రాజ్యమని అద్వానీ ఆనందంగా చెప్పారు.వచ్చే ఎన్నికల తర్వాత కూడా ప్రధాని వాజ్ పేయేప్రభుత్వానికి సారధ్యం వహించగలరనిఅద్వానీ ఆశాభావం వ్యక్తం చేశారు.