వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ పట్ల వైఖరి మారలేదు: జార్జి
డెహ్రాడూన్: పాకిస్థాన్తో చర్చలు జరిపేవిషయంలో భారత వైఖరి మారలేదని రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ స్పష్టం చేశారు. శాంతి చర్చలు ప్రారంభించడానికి ముందు పాకిస్థాన్ జమ్మూ కాశ్మీర్లోకి చొరబాట్లు ఆపేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
సరిహద్దు నుంచి చొరబాట్లు జరిగే స్థాయిలో మార్పేమీ లేదని, కొంచెం ఎక్కువలు తక్కవ పరిస్థితిఒకే విధంగా ఉన్నదని ఆయన అన్నారు. ఇరు దేశాల మధ్యవిశ్వాసం పెంపొందిండానికి జరుగుతున్న చర్యలు ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ ప్రారంభానికి సూచిక కాదని ఆయన అన్నారు. పాకిస్థాన్కు బస్సు,రైలు సర్వీసుల పునరుద్ధరణ గురించి చర్చలు జరిగాయని, అయితే చర్చల ప్రారంభం దిశగా వేసే అడుగులు కాదని ఆయన అన్నారు.
Comments
Story first published: Saturday, June 14, 2003, 23:53 [IST]