వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దూసుకెళ్ళిన లారీ, 3గురి మృతి
వరంగల్: వరంగల్ పట్టణంలోని ఓ ఇంట్లోకి ఇసుకలారీ దూసుకెళ్ళడంతోముగ్గురు అక్కడికక్కడే మరణించారు. శనివారంఉదయం వేగంగా వస్తోన్న ఓ ఇసుక లారీ ఆర్ ఇసి రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంట్లోకిదూసుకెళ్ళింది. ఆ ఇంట్లో నివసిస్తోన్న ఇంటి యజమానురాలుటి.విద్య(38)తో పాటు ఆమె ఇద్దరు కూతుళ్ళు అక్కడికక్కడేమరణించారు.
మరో కూతురు తీవ్రంగా గాయపడడంతో ఆమెను స్థానిక ఎంజిఎం ఆస్పత్రిలోచేర్పించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.డ్రైవర్ చేతిలో స్టీరింగ్ అదుపు తప్పడంతో ఈ ఘటనజరిగిందని పోలీసులు తెలిపారు. ఇల్లు పూర్తిగా దెబ్బతింది.పక్కనే ఉన్న మరో పాన్ షాప్ కూడా పాక్షికంగా దెబ్బతింది. హన్మకొండ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.
Comments
Story first published: Saturday, June 14, 2003, 23:53 [IST]