పరగోడుపై ప్రభుత్వానికి అఖిల మద్దతు
హైదరాబాద్: పరగోడువద్ద కర్ణాటక నిర్మిస్తోన్న ప్రాజెక్ట్ పై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శనివారంఅఖిలపక్షం సమావేశం అయింది. సాయంత్రంసచివాలయంలో ఏర్పాటైన ఈ సమావేశానికికాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, మజ్లిస్ కు చెందిన పార్టీ నేతలుహాజరయ్యారు. పరగోడుపై కర్ణాటక చేపట్టిన ప్రాజెక్ట్నిర్మాణం అక్రమం అనీ, ఈ విషయంలోరాష్ట్రప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామనిఅన్ని పార్టీలు మద్దతు పలికాయి. తాజా పరిస్థితిని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు అఖిలపక్షానికి వివరించారు.
కాంగ్రెస్ తరఫున సీనియర్కాంగ్రెస్ నేత ఎం.వి.మైసూరారెడ్డి హాజరు కాగా, బీజేఎల్ పీ నేత ఇంద్రాసేన రెడ్డి తదితరులుహాజరయ్యారు. పరగోడుపై ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొనడంపైకాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయప్రయోజనాలను పక్కనపెట్టి అన్ని పార్టీలు కలిసికట్టుగాపరగోడుపై ఉద్యమించాలని నిర్ణయించాయి. మరోవైపు,పరగోడు ప్రాజెక్ట్ పరిశీలనకు ఒక బృందంహైదరాబాద్ కు విచ్చేసింది. ప్రస్తుతం ప్రభుత్వంతో అదిచర్చలు జరుపుతోంది. మరో బృందంకర్ణాటకలో పర్యటిస్తోంది.