కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబు అరెస్టు
చిత్తూరు: చిత్తూరు పట్టణ సమీపంలో ఒక యువకుడిని కిడ్నాప్ చేసి హత్య చేశారనే ఆరోపణపై కాంగ్రెస్ శాసనసభ్యుడుసి.కె. జయచంద్రారెడ్డి అలియాస్ సి.కె. బాబును పోలీసులుఅరెస్టు చేశారు. ఈ అరెస్టు ఆదివారం ఉదయం జరిగింది.
ఇంటరాగేషన్ కోసం బాబును కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. యువకుడి కిడ్నాప్, హత్య శనివారం రాత్రి 8- 10 గంటల మధ్య జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. శాసనసభ్యుడిసమీపబంధువు సుదీప్కు, తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు రాజేశ్వరి కుమారుడు రవి శంకర్ చౌదరికి మధ్య ఉన్న ఘర్షణలో భాగంగానే ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు.
పోలీసుల కథనం, బాధితుల ఆరోపణల ప్రకారం-స్వల్ప సంఘటనపై రవి శంకర్ ఖాళీ కూల్ డ్రింక్సీసాతో సుదీప్ను కొట్టాడు. గాయపడిన సుదీప్ ఈవిషయాన్ని సి.కె.బాబుకు చెప్పాడు. దాంతో సి.కె. బాబు రాజేశ్వరి నడుపుతున్న హార్డ్వేర్ షాప్కు వెళ్లాడు. అక్కడ రవి శంకర్ చౌదరి కనిపించలేదు. దాంతో షాప్ను కొంత మేరకు ధ్వంసం చేశాడు. ఆ తర్వాత కొంత మంది మిత్రులతో రవిశంకర్ ఇంట్లో కనిపించాడు. మాట్లాడాల్సి ఉన్నదని చెప్పి రవిశంకర్నుసి.కె. బాబు తనతో తీసికెళ్లాడు.
రవిశంకర్ను చిత్తూరుకు 20 కిలోమీటర్ల దూరంలో గలకాణిపాకం రోడ్డు దాకా తీసికెళ్లాడు. అక్కడరవిశంకర్పై సి.కె.బాబు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆదివారం ఉదయం రవిశంకర్ చౌదరి మృతదేహం సగం కాలి హైవే పక్కన కనిపించింది. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సి.కె.బాబుపై కిడ్నాప్, హత్య కింద కేసులు నమోదు చేసిఅరెస్టు చేశారు. ఈ సంఘటనతో చిత్తూరు పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది.