ఎన్నికల్లో హిందూత్వను వాడం: వెంకయ్య
రాంచీ: తమ పార్టీ హిందూత్వను ఓట్ల కోసం వాడబోదని, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) ఎజెండాకు దూరం కాదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అయితే బిజెపి హిందూత్వ సిద్ధాంతాన్ని వదులుకోదని ఆయన చెప్పారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఇక్కడ ప్రసంగించారు.
భారతీయాత్మ అయినందున బిజెపి హిందూత్వకు దూరమయ్యే ప్రసక్తే లేదని, కానీ దాన్ని ఓట్ల కోసం వాడబోమని ఆయన చెప్పారు. సంకీర్ణ ఎజెండానుఅగౌరవ పరిచే ఉద్దేశం తమకు లేదని, దాన్ని నీరుగార్చే ప్రసక్తి గానీ, దాని నుంచి దూరమయ్యే ప్రశ్నగానీ ఉత్పన్నం కాదని ఆయన అన్నారు.
మైనారిటీలను కలుసుకొని బిజెపి దేశ పౌరులందరిదీ అనేవిశ్వాసాన్ని వారిలో పెంపొందించాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వాజ్పేయి నాయకత్వంలో దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడానికి తమకు ముస్లింలు, క్రిస్టియన్లు, వెనుకబడిన తరగతులవారు, అగ్రవర్ణాల వారు-అందరూ కావాలని ఆయన చెప్పారు. మైనారిటీలకు బిజెపిప టికెట్లు ఇవ్వడం లేదనేవిమర్శను ఆయన ఖండించారు. అలా విమర్శించేవారు పార్టీకి దగ్గరగా వచ్చి చూడాలని, బిజెపికిఅందరూ కావాల్సినవారేనని ఆయన అన్నారు.