వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాజ్పేయితో సోనియా భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని అటల్బిహారీ వాజ్పేయిని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం సాయంత్రం కలుసుకున్నారు.
ఆమె వెంట కాంగ్రెస్ సీనియర్ నేతలు నట్వర్సింగ్, మన్మోహన్ సింగ్లు ఉన్నారు. ఈ చర్చల్లో వాజ్పేయి మంత్రివర్గ సభ్యులు యశ్వంత్సిన్హా, జస్వంత్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఇరాక్కు శాంతి దళాలను పంపేవిషయమై వాజ్పేయికి, సోనియాకు మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ఇరాక్కు శాంతి దళాలను పంపాలని అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు. బుష్ భారత్కువిజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ అమెరికా పర్యటన సందర్భంగా బుష్ ఈవిజ్ఞప్తి చేశారు.
Comments
Story first published: Sunday, June 15, 2003, 23:53 [IST]