వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందుపాతరకు ముగ్గురు పోలీసులు బలి

By Staff
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: నిషిద్ధ పీపుల్స్‌వార్‌ నక్సలైట్లుపేల్చిన మందుపాతరకు ముగ్గురు పోలీసులు బలయ్యారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండలం నెమలిపురి వద్ద సోమవారం ఉదయం జరిగింది.

నక్సలైట్లు పేల్చిన మందుపాతరకు ఒక రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఆర్‌ఎస్‌ఐ)తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు మృతిచెందారు. మరణించినవారిని ఆర్‌ఎస్‌ఐ గంగారామ్‌,కానిస్టేబుళ్లు చెన్నకేశవులు, శంకర్‌నాయక్‌లుగాగుర్తించారు. నక్సలైట్లు వలపన్ని పోలీసులను హతమార్చారు.

అంతకుముందు రోజు ఈ గ్రామంలోకి నక్సల్స్‌ జొరబాడి గ్రామస్థులను చితకబాదారు. దీంతో గ్రామస్థులు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ గ్రామం చుట్టుపక్కల గాలింపు మొదలుపెట్టగానే నక్సల్స్‌ మందుపాతరపేల్చారు. పోలీసులపై ఎదురుకాల్పులు జరిపారు. పోలీసులు కూడా కాల్పులు జరిపినప్పిటకీ నక్సల్స్‌ చిక్కలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X