వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామపక్షాలతో దోస్తీకి చర్చలు: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వామపక్షాలతోసీట్ల సర్దుబాటు చేసుకునే అవకాశం ఉన్నదని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు.శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆదివారం సాయంత్రం తన పాదయాత్రను ముగించుకున్న ఆయన అర్థరాత్రికివిశాఖపట్నం చేరుకున్నారు.

ఆయన సోమవారం ఉదయం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వామపక్షాలతో ఎన్నికల అవగాహన కుదుర్చుకోవడానికి జాతీయ స్థాయిలో తమ పార్టీ అధిష్ఠాన వర్గం వామపక్షాలతో చర్చలు జరుపుతోందని ఆయన చెప్పారు. చిత్తూరు కాంగ్రెస్‌ శాసనసభ్యుడుసి.కె. బాబు అరెస్టు అనైతికమని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ నాయకులపై కేసులుపెట్టి వేధించడం తెలుగుదేశం ప్రభుత్వం ఆనవాయితీగా చేస్తున్న పనేనని ఆయన అన్నారు. నేరారోపణలు ఎదుర్కుంటున్న ముగ్గురు రాష్ట్ర మంత్రులను ఎందుకుఅరెస్టు చేయరని ఆయన అడిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X