సింగరేణి ప్రమాదంపై న్యాయవిచారణ
కరీంనగర్: రామగుండం సింగరేణి గనుల్లో జరిగిన ప్రమాదంపై న్యాయవిచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. అత్యవసర రక్షణ ఏర్పాట్ల సౌకర్యం లేకపోవడం లోపమేనని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంబంధిత శాఖతో మాట్లాడి సంఘటనపై కోర్ట్ ఆఫ్ఎంక్వయిరీ కూడా జరిపిస్తామని ఆయన చెప్పారు. రామగుండం సింగరేణి గనుల్లో జరిగిన ప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం సందర్శించారు. ప్రమాద కారణాలపై ఆయన ఆరా తీశారు. నీరు లీకయి ప్రవాహంలా వచ్చి చేరడంతో సింగరేణి బొగ్గు గనిలో సోమవారం 17 మంది జల సమాధిఅయిన విషయం తెలిసిందే.
ప్రమాదంలో మరణించినవారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆరేసి లక్షల రూపాయలఎక్స్గ్రేషియా ప్రకటించారు. వారంలోగా కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. పరిస్థితులను పరిశీలించడానికి ఆయనతో పాటు కేంద్ర మంత్రిసిహెచ్. విద్యాసాగరరావు గనిలోకి దిగారు. అయితే ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రమాద స్థలంలోపెద్ద యెత్తున జనం కూడారు. వారిని అదుపు చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారు. ఆగ్రహించిన ప్రజలు ముఖ్యమంత్రినిఘెరావ్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన కాన్వాయ్పై రాళ్లు రువ్వారు.
ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు వేణుగోపాలాచారివిమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి నేత కె. చంద్రశేఖర్ రావు కూడా ప్రమాదస్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి బాధ్యులైన అధికారులను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రమాదానికి నిరసనగా టిఆర్ఎస్ ధర్నా చేసింది.
ప్రమాదానికి సింగరేణి యాజమాన్యమే కారణమని ఐఎన్టియుసివిమర్శించింది. రాష్ట్ర విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు, తదితరులు ప్రమాద స్థలాన్ని సందర్శించారు. గనిలో నిండిన నీటిలో లక్షల గ్యాలన్లను ఇప్పటి వరకు తోడేశారు.