వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వార్ మందుపాతర- ఇద్దరు పోలీసులు బలి
రాజమండ్రి: నిషిద్ధ పీపుల్స్వార్పేల్చిన మరో మందుపాతరకు ఇద్దరు పోలీసులు బలయ్యారు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో జరిగింది.
నక్సలైట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టి పోలీసులు తిరిగి వస్తుండగా పోలవవరప్పాడు అడవుల్లో నక్సలైట్లు మందుపాతరపేల్చారు. ఈ సంఘటనలో కానిస్టేబుల్ జె. శ్రీనివాసరావు, కేంద్ర భద్రతా బలాగానికి(సిఆర్పిఎఫ్కు) చెందిన జవాను సురేష్ సింగ్ మరణించారు. ఒక హెడ్ కానిస్టేబుల్ గాయపడ్డాడు. గాయపడిన హెడ్ కానిస్టేబుల్ను రాజమండ్రి ఆస్పత్రిలో చేర్చారు. సోమవారం నిషిద్ధపీపుల్స్వార్ నల్లగొండ జిల్లాలో మందుపాతరపేల్చి ముగ్గురు పోలీసులను బలి తీసుకున్నారు.
Comments
Story first published: Tuesday, June 17, 2003, 23:53 [IST]