వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గని ప్రమాదం- 15 మృతదేహాల వెలికితీత
కరీంనగర్: కరీంనగర్ జిల్లా గోదావరిఖని బొగ్గు గనిలోంచి 15 మంది కార్మికుల మృతదేహాలను వెలికితీశారు. అకస్మాత్తుగా ప్రవాహం వచ్చి చేరడంతో మూడు రోజుల క్రితం 17 మంది కార్మికులు జలసమాధిఅయిన విషయం తెలిసిందే.
సోమవారం రాత్రి నుంచి బొగ్గు గనిలోని నీటిని తోడివేస్తున్నారు. దీంతో బుధవారం ఉదయం 15 మంది కార్మికుల శవాలు దొరికాయి. ఈ రెండు శవాల జడా తెలియాల్సి ఉంది. గనిలోని బురదలో మరో ఇద్దరి శవాలు కూరుకుపోయి ఉంటాయని భావిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకు 19వ లెవెల్ వరకు నీటిని తోడారు. మరో 30మీటర్ల లోతు నీరు ఉంటుంది. వెలికి తీసి శవాలను గుర్తించి పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకుఅప్పగించారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనతో ఆ ప్రాంతంలోవిషాదం అలుముకుంది.
Comments
Story first published: Wednesday, June 18, 2003, 23:53 [IST]