వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్నికలకు సిద్ధం కండి: అద్వానీ పిలుపు
ముంబాయి: పార్టీని బలోపేతం చేసి 2004లో జరిగే లోక్సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఉప ప్రధాని, భారతీయ జనతా పార్టీ నేత ఎల్.కె. అద్వానీ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. థానే జిల్లాలోని ఉత్తాన్లో ఏర్పాటయిన పార్టీ మేధోమథనం సదస్సులో ఆయన శుక్రవారం ముగింపు ప్రసంగం చేశారు.
ఇండో పాక్ సంబంధాల గురించి, పాక్తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి ఆయన మాట్లాడారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి కూడా ఆయనవివరించారు. అనంతరం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
Story first published: Friday, June 20, 2003, 23:53 [IST]