వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉచిత విద్యుత్తే నినాదంః వైఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః వచ్చేఎన్నికల్లో ఉచిత విద్యుత్‌ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానాంశంగాఉంటుందని సిఎల్పీ నాయకుడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిఅన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ విషయంలోకాంగ్రెస్‌ లో అయోమయం ఏమీలేదని ఆయన శుక్రవారం ఇక్కడమీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయనచెప్పారు. సుదీర్ఘ పాదయాత్ర అనంతరం వైఎస్‌నగరానికి చేరుకున్న సందర్భంగా వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘంఆయనను మీట్‌ ది ప్రెస్‌ కు ఆహ్వానించింది.వచ్చే ఎన్నికల్లో రైతులు, పేదల సంక్షేమమే తమ ప్రధానాంశంగాఉంటుందని వైఎస్‌ వివరించారు.

ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తుఉండబోదని, వామపక్షాలతో పొత్తు విషయాన్నిఖండించలేమని ఆయన అన్నారు. రాష్ట్రంలోతెలుగుదేశం ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగావీస్తున్నాయని, ఈ పరిస్ధితిని తనకు అనుకూలంగామలుచుకునే శక్తి తమకు ఉందని రాజశేఖరరెడ్డిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంతధ్యమని, కాంగ్రెస్‌ నాయకులంతా సంఘటితంగాఎన్నికల్లో పోరాడుతారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X