వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గ్రామకక్షలకు ఆరుగురు బలి
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో గ్రామ కక్షలు పడగవిప్పాయి. ఈ కక్షలకు ఆరుగురుబలయ్యారు. మృతులు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు.
ప్రకాశం జిల్లా పెద్దవరం గ్రామంలో ప్రత్యర్థులు ఆరుగురిని దారుణంగా హత్య చేశారు. పాతకక్షలే ఈ హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత రెండు గంటల ప్రాంతంలో ఈ హత్యలు జరిగాయి. మరణించినవారందరూ బంధువులే కావడం గమనార్హం. హతుల్లో గ్రామ సర్పంచ్ కిలారి ఆంజనేయులు ఉన్నాడు. మరణించినవారిలో ఇద్దరిపేర్లు కిలారి వెంకటేశ్వర్లు కాగా, మరొకరి పేరు చిన వెంకటేశ్వర్లు. ఇంకొకరు ఆంజనేయులే.వీరితో పాటు అంజలి అనే బాలిక కూడా ఈ దారుణానికి బలిఅయింది.
Comments
Story first published: Saturday, June 21, 2003, 23:53 [IST]