వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెలు పట్టాలు తప్పి 23 మంది మృతి
ముంబాయి: కర్వార్- ముంబాయిసెంట్రల్ హాలిడే స్పెషల్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో కనీసం23 మంది మృతి చెందారు. 24 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఆదివారం రాత్రి మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో గల రత్నగిరి వద్ద జరిగింది.
ముంబాయి నుంచి కర్వార్కు బయలుదేరిన ఈరైలు నెర్లే టన్నెల్ మీదుగా సాగుతుండగా రెండు జనరల్ కోచ్లు, ఒక ఎసి కోచ్, ఇంజన్ పట్టాలు తప్పాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల బురద పట్టాలపై పడి ఉందని కొంకణ్రైల్లే అధికారులు చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను, క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్యపెరగవచ్చునని అనుమానిస్తున్నారు.
Comments
Story first published: Monday, June 23, 2003, 23:53 [IST]