వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విజయవాడలో అదుపు కాని అతిసారా
విజయవాడ: విజయవాడలో ప్రబలిన అతిసారా వ్యాధి ఇంకా అదుపులోకి రాలేదు. ఐదు రోజుల క్రితం ప్రారంభమైన అతిసారా వ్యాధి ముగ్గుర్ని బలితీసుకుంది.
అతిసారా వల్ల వంద మందికిపైగాఅస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. మున్సిపల్ కార్యాలయం సరఫరా చేసిన నీరు కలుషితం కావడం వల్లనే ఈ వ్యాధి ప్రబలిందని అనుమానిస్తున్నారు. కమీషనర్ ప్రవీణ్ ప్రకాశ్, మేయర్ అనురాధ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అతిసారా ప్రబలిన ప్రాంతాల్లో ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు.అస్వస్థులైనవారికి చికిత్సను అందజేసేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. మాంసం, చేపల మార్కెట్లను వారం రోజుల పాటు మూసేయించారు.
Story first published: Monday, June 23, 2003, 23:53 [IST]