వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎమ్మెల్యే కిడ్నాప్ యత్నంతో కలకలం
అనంతపురం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శాసనసభ్యురాలు శారదాంబనుపీపుల్స్వార్ నక్సలైట్లు కిడ్నాప్ చేయడానికి చేసిన ప్రయత్నం జిల్లాలోని రాజకీయ నాయకుల్లో కలవరం రేపింది. జిల్లాలో ఇటువంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి.
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు శారదాంబను కిడ్నాప్ చేయడానికిపీపుల్స్వార్ నక్సలైట్లు సోమవారం ప్రయత్నించారు. జనచైతన్య యాత్రలో భాగంగా ఆమె సోమవారం రాళ్లఅనంతపురం గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో ఆరుగురు సాయుధ నక్సలైట్లు దాడి చేసి శాసనభ్యురాల్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించగా గ్రామప్రజలు ఎదురు తిరిగారు. ఈ సమయంలో నక్సల్స్ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మనోహర్ అనే యువకుడు మరణించాడు. శారదాంబ గన్మన్ పిస్తోల్ లాక్కుని నక్సల్స్ వెళ్లిపోయారు. ప్రజలు ముగ్గురు నక్సలైట్లను నిర్బంధించి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత వారిని వదిలిపెట్టారు.
Comments
Story first published: Tuesday, June 24, 2003, 23:53 [IST]