చైనా-భారత్ల సంయుక్త అధ్యయన గ్రూపు
బీజింగ్: ఆర్థిక సహకారాన్ని మరింతపెంపొందిచుకునేందుకు వీలు సంయుక్త అధ్యయన గ్రూపు ఏర్పాటు చేయాలని చైనా, భారత్లు నిర్ణయించుకున్నాయి. ఈ గ్రూపులో ఆర్థిక నిపుణులు, అధికారులు ఉంటారు. బహుముఖ ఆర్థిక పరస్పర సహకార అభివృద్ధికి కొత్త రంగాలను గుర్తించి ఈ గ్రూపు సమగ్ర ప్రణాళికను రూపొందిస్తుంది. చైనా ప్రధాని వెన్ జియబావోతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఉభయ
దేశాల
ఆర్థిక
సహకారాన్ని
అత్యున్నత
స్థాయికి
తీసికెళ్లాలని
నిర్ఱయించుకున్నట్లు
ప్రధాని
అటల్బిహారీ
వాజ్పేయి
చెప్పారు.
చైనా-
భారత
ఆర్థిక
సహకారం,
అభివృద్ధి
అనేఅంశంపై
ఏర్పాటయిన
సదస్సులో
ఆయన
ప్రసంగించారు.
ఇరు
దేశాల
మధ్య
పరస్పర
ఆర్థిక
వినిమయం
వేగవంతం
కావాలంటే
ఇరు
దేశాల
మధ్య
ప్యాసెంజర్,
కార్గో
రవాణా
సంబంధాలు,
బ్యాంకింగ్
మద్దతు
ఏర్పాట్లు,
వాణిజ్య
సౌలభ్య
ఏర్పాట్లు
పటిష్టం
కావడం
ముఖ్యమని
ఆయన
అన్నారు.
జెమిన్తో వాజ్పేయి భేటీ
చైనా పర్యటనలో ఉన్న భారత ప్రధాని వాజ్పేయి మంగళవారం ఉదయం చైనాసెంట్రల్ మిలటరీ కమీషన్ చైర్మన్ జియాంగ్ జెమిన్తో సమావేశమయ్యారు. బీజింగ్కు 40 కిలోమీటర్ల దూరంలో గల యుఖాన్ షాన్పర్వతశ్రేణి ప్రాంతంలో ఉన్న రిసార్ట్లో వీరిద్దరు సమావేశమయ్యారు. ఈ నెల 22వ తేదీన బీజింగ్ చేరుకున్న వాజ్పేయి అదే రోజు చైనా ప్రధాని వెన్ జియాబావోతో సమావేశమయ్యారు.