వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైలు ప్రమాదం మృతులు 51 మంది
వైభవ్వాడి: కార్వార్- ముంబాయి హాలిడేస్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం మృతుల సంఖ్య 51 చేరుకుంది. మరో 17 మృతదేహాలను వెలికితీయడంతో మృతుల సంఖ్యపెరిగింది. పై నుంచి ఎడతెరిపి లేకుండా ముసురు పడుతూనే ఉంది.అయినప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
గాయపడిన 60 మంది ఓరోస్, రత్నగిరి, కంకావ్లీల, గోవాలలోని ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నట్లు కొంకణ్రైల్వే అధికారులు మంగళవారం చెప్పారు. గాయపడినవారిలో 15 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 150 మందితో కూడినసైన్యం సహాయక చర్యల్లో మునిగి ఉంది. రైలు ఇంజన్, ఒక బోగీ ఇంకా శిథిలాల మధ్య చిక్కుకునే ఉన్నాయి.
Comments
Story first published: Tuesday, June 24, 2003, 23:53 [IST]