రైతులపై పోలీసుల దౌర్జన్యం, కాల్పులు
చేవేళ్ళ: రంగారెడ్డి జిల్లా చేవేళ్ళ మండలంలో రైతులను నిరోధించడంలో పోలీసులు అతిగా ప్రవర్తించి కాల్పులు జరపడంతో ఓ రైతు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరో రైతు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పలువురికి గాయాలయ్యాయి. విత్తనాల పంపిణీ కోసం రెండు వేల మంది రైతులు బుధవారం మార్కెట్ యార్డ్విచ్చేశారు. విత్తనాలు తక్కువగా ఉండడంతో వాటి కోసం రైతులు ఎగబడ్డారు.
ఈ సందర్భంగా తోపులాట జరిగింది. రైతులను అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి తీవ్రంగా బాదడం మొదలుపెట్టారు. దొరికిన వారినల్లా దొరికట్లు...దారిన పోయి వారిని సైతం వారు చితకబాదారు. దీంతో రైతులు పోలీసులుపై తిరగబడ్డారు.
రెచ్చిపోయిన పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక రైతు మృతి చెందాడు. కొద్దిసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చేవేళ్ళ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఘటనాస్థలానికివిచ్చేసి రైతులతో బైఠాయించి ధర్నా చేశారు.