వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాజ్ పేయి చైనా పర్యటన ఫలప్రదం
బీజింగ్ః భారత ప్రధాని అటల్బిహారీ వాజ్ పేయి పర్యటన విజయవంతమైనట్టుచైనా ప్రభుత్వం బుధవారం అభివర్ణించింది.భారత్-చైనా సంబంధాల పటిష్టతకు ఈ పర్యటనముఖ్యమైనదని పేర్కొంది. భారత్ చైనాద్వైపాక్షిక సంబంధాల సూత్రాలు, పరస్పర సహకారంపైకుదిరిన ఒప్పందం సానుకూలం, పరస్పరప్రయోజనకరం అని చైనావిదేశాంగ శాఖ ప్రతినిధి కాంగ్ క్వాన్ అభివర్ణించారు.
ఉభయ దేశాల వర్తమానఅభివృద్ధికే గాక దీర్ఘకాలిక యావత్ దక్షిణాసియాదీర్ఘకాలిక అభివృద్ధి, సుస్ధిరత, సౌభాగ్యాలకు ఈఒప్పందం బాటలు వేయగలదని ఆయన అన్నారు.చైనా అధ్యక్షుడు, కమ్యూనిస్టు పార్టీ ప్రధానకార్యదర్శి హూ జింటావో, సెంట్రల్ మిలిటరీకమిషన్ చైర్మన్ జియాంగ్ జెమిన్ తదితరులతోవాజ్ పేయి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయనిఆయన పేర్కొన్నారు.
Comments
Story first published: Wednesday, June 25, 2003, 23:53 [IST]