వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మాచర్ల వద్ద ఇద్దరు నక్సల్స్ కాల్చివేత
గుంటూరుః గుంటూరు జిల్లామాచర్ల సమీపంలో బుధవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. చనిపోయినవారిలో ఒకరిని జనశక్తి గ్రూపు ఏరియాకమాండర్ సుభానీ అలియాస్ ఆర్కే గా గుర్తించినట్టు జిల్లా ఎస్పీ రవిశంకర్ తెలిపారు.వీరు తాళ్లపల్లి గ్రామ శివారులోకి భూస్వాములను,రైస్ మిల్లర్లను పిలిపించి డబ్బులు వసూలుచేస్తుండగా గస్తీ తిరుగుతున్న పోలీసు పార్టీఅక్కడికి చేరుకుందని ఆయన చెప్పారు.
పోలీసులు సమీపించడంతోనక్సలైట్లు ఇష్టమొచ్చినట్టు కాల్పులు జరపగా ఒక గ్రామస్తుడుగాయపడినట్టు వివరించారు. పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతోఇద్దరు నక్సలైట్లు మృతి చెందినట్టుచెప్పారు. ప్రతి ఎన్ కౌంటర్ లోనూ దొరికినట్టే ఇక్కడ కూడా తపంచా,సర్వీసు రివాల్వర్, మందుపాతరల్లో వాడే పేలుడుపదార్ధం, కిట్ బ్యాగ్, విప్లవ సాహిత్యంలభించాయని పోలీసులు చెబుతున్నారు.
Story first published: Wednesday, June 25, 2003, 23:53 [IST]