వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాధితులకు వైఎస్ పరామర్శ
హైదరాబాద్ఃచేవెళ్ళలో రైతులపై కాల్పులు జరపడం రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక ధోరణికినిదర్శనమని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.నిన్న పోలీసు కాల్పుల్లో,లాఠీచార్జీలో గాయపడిన రైతులను పిసిసి అధ్యక్షుడుఎం.సత్యనారాయణ రావు, సిఎల్పీ నాయకుడు డాక్టర్వైఎస్ రాజశేఖరరెడ్డి పరామర్శించారు.
హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రైతులను పలకరించి సంఘటనపూర్వాపరాలను వారు తెలుసుకున్నారు. రైతులకు విత్తనాలు కూడా సరఫరాచేయలేని ప్రభుత్వం వారిని అమానుషంగా అణిచివేయాలనిప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.
Comments
Story first published: Thursday, June 26, 2003, 23:53 [IST]