వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కావలి పోలీసు ఓవరాక్షన్
నెల్లూరుః కావలిపట్టణంలో తస్లిమాబాను కేసులో పోలీసుల అక్రమాలనునిరసిస్తూ నిన్న జరిగిన సభలోజర్నలిస్టులపై పోలీసులు దౌర్జన్యం చేశారు. తస్లిమాబానుఅత్యాచారానికి, హత్యకు గురైందని ఒక టీవీ ఛానల్బయటపెట్టినప్పటి నుంచి జర్నలిస్టులకు పోలీసులకు మధ్య కావలిపట్టణంలో ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనేఉంది.
నిజాలను పోలీసు కప్పిపెడుతున్నారనివార్తలు రావడంతో తస్లిమాబానుమృతదేహానికి తిరిగి పోస్టు మార్టంచేశారు. అప్పటి నుంచి కావలి సిఐ, ఎస్ ఐలు జర్నలిస్టులమీద కారాలు మిరియాలు నూరుతున్నారు. నిన్న జరిగిననిరసన సభ వార్తను కవర్ చేయడానికివచ్చిన జర్నలిస్టులను పోలీసులు విచక్షణరహితంగా కొట్టారు. పోలీసు దౌర్జన్యాలను వివిధ జర్నలిస్టు సంఘాలుఖండించాయి. దౌర్జన్యం చేసిన పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్చేశాయి.
Comments
Story first published: Friday, June 27, 2003, 23:53 [IST]