వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరీంనగర్ జిల్లాలో నలుగురిపై పొటా
కరీంనగర్: కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ పోలీసుస్టేషన్ పేల్చివేత సంఘటనలో పోలీసులు నలుగురిపై పొటా కింద కేసు నమోదు చేశారు. జిల్లాలో పొటా కింద కేసు నమోదు చేయడం ఇదే మొదటిసారి.
ఇటీవల పీపుల్స్వార్ నక్సలైట్లు బస్సులో మందుగుండు సామగ్రి వేసుకొని వచ్చి మహదేవ్పూర్ పోలీసుస్టేషన్ను పేల్చివేశారు. పొటా కింద కేసులు నమోదైన నలుగురిలో దేవేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి అనే వ్యక్తులున్నారు. మరో ఇద్దరిపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు జిల్లా పోలీసు సూపరింటిండెంట్ ప్రవీణ్కుమార్ చెప్పారు. నిషిద్ధపీపుల్స్వార్ నక్సలైట్లకు ప్రభుత్వోద్యోగులు, రాజకీయ నాయకులు సహకరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు.
Comments
Story first published: Friday, June 27, 2003, 23:53 [IST]