జమ్మూలో 12 మంది జవాన్ల బలి
శ్రీనగర్: జమ్మూ శివారులోని సౌజీవన్సైనిక శిబిరంపై శనివారం ఉదయం ఇద్దరు ఆత్మాహుతి దళానికి చెందినమిలిటెంట్లు చేసిన దాడిలో 12 మంది జవాన్లు మరణించారు. హోరాహోరి సాయుధ పోరులో ఆ ఇద్దరుమిలిటెంట్లు హతమయ్యారు.
గ్రెనేడ్లు, ఆటోమేటిక్ రైఫిళ్లు ధరించిన ఇద్దరుమిలిటెంట్లు శనివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల ప్రాంతంలోసైనిక శిబిరంపై దాడి చేశారు. సైనిక శిబిరంలోకి దూసుకురావడానికి ముందు వారు ప్రధాన ద్వారం వద్దసెంట్రీ పోస్టు వద్ద గల ఇద్దరు సైనికులను కాల్చి చంపారు. వెంటనే శిబిరంలోని గార్డులుమిలిటెంట్లపై కాల్పులు ప్రారంభించారు.
అయితే అప్పటికే మరో పది మంది జవాన్లుమిలిటెంట్ల చేతిలో బలయ్యారు. సైనిక దుస్తుల్లోమిలిటెంట్లు లోనికి ప్రవేశించారు. ఈ దారుణానికి పాల్పడింది తామేనంటూ ఆల్ నస్రీన్ అధికార ప్రతినిధిగా చెప్పుకుంటున్న అబూ సలీమ్ మెహమూద్ ప్రకటించుకున్నాడు. ఈ దాడిలో ముగ్గురుమిలిటెంట్లు పాల్గొన్నట్లు అతను పిటిఐ వార్తాసంస్థకు ఫోన్ ద్వారా తెలియజేశాడు.