వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శ్రీహరిపై కెసిఆర్ వ్యంగ్యాస్త్రాలు
హైదరాబాద్: కృష్ణా నదిపై తలపెట్టిన పులిచింతల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందనే భారీ నీటి పారుదల మంత్రి కడియం శ్రీహరి ప్రకటనను తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడుకె. చంద్రశేఖర్ రావు ఎద్దేవా చేశారు. శ్రీహరి ప్రకటన హాస్యాస్పదంగా ఉన్నదని ఆయన శనివారంవిలేకరుల సమావేశంలో అన్నారు.
తెలంగాణ ప్రయోజనాలనుదెబ్బ తీసే పులిచింతల ప్రాజెక్టును చేపడితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒక ప్రాజెక్టు వల్ల ఆ ప్రాజెక్టు దిగువ ప్రాంతానికి కాకుండా ఎగువ ప్రాంతానికి ప్రయోజనం చేకూరుతుందని శ్రీహరి చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ 980 టిఎంసిల కృష్ణా జలాలనువాడుకుంటోందని, ఇందులో తెలంగాణకు 150 టిఎంసిల నీరు మాత్రమేఅందుబాటులో ఉన్నదని ఆయన చెప్పారు.
Comments
Story first published: Saturday, June 28, 2003, 23:53 [IST]