వాజ్పేయి, అద్వానీల పాత్ర లేదు
న్యూఢిల్లీ: అయోధ్యలోవివాదాస్పద కట్టడం కూల్చివేతలో ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి, ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రి మురళీ మనోహర్ జోషీల పాత్ర ఏ మాత్రం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.వీరి పాత్ర ఉన్నదని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ఆరోపణ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం లిబర్హాన్ కమీషన్ ముందు ఈ స్పష్టీకరణ చేసింది.
అయోధ్య ఉద్యమ నేతలు సాధువులు, సంతులేనని, డాక్టర్ జోషి, అద్వానీ, వాజ్పేయి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఇతర నేతలు ఈ ఉద్యమాన్ని బలపరుస్తున్నారని, అయితే రామాలయ నిర్మాణానికి ఏకాభిప్రాయ సాధన కోసం సమావేశానికి ప్రాతిపదిక ఏర్పరిచే దిశగానే సాగాలనేదేవీరి విధానమని కేంద్ర ప్రతినిధి లాల్ రామ్ గుప్తా కమీషన్ ముందు చెప్పారు. అయోధ్య ప్రచార సందర్భంలో అద్వానీ ముస్లిం వ్యతిరేక వ్యాఖ్య ఒకటి కూడా చేయలేదని ఆయన పోలండ్ రచయిత కియోన్రాడ్ రాసిన ది షాఫ్రాన్స్వస్తికా పుస్తకంలోని మాటలను ఉటంకిస్తూ చెప్పారు.