వరంగల్లో రైతుల ఆందోళన- లాఠీఛార్జి
వరంగల్ః సరళ్ బ్రాండునకిలీ మిర్చి విత్తనాలు కొన్న వరంగల్ జిల్లా రైతులు సోమవారంఉదయం వరంగల్ స్టేషన్ రోడ్డులోని విత్తనాలదుకాణాల వద్ద శాంతయుతంగా ఆందోళనచేపట్టారు. సరళ్ బ్రాండు మిర్చి విత్తనాలు అమ్మినవివిద సీడ్స్ షాపుల యజమానులు రసీదులు చూపిస్తేడబ్బు వాపసు చేస్తామని చెప్పడంతో రైతులు సోమవారం ఉదయానికి కల్లా ఇక్కడికి చేరుకున్నారు. మోసపోయిన రైతులంతా ఒక చోటికి చేరడంతో స్టేషన్ రోడ్డులో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. డబ్బులిస్తామని చెప్పిన దుకాణుదారులు లేకపోవడంతో రైతులు ఆగ్రహం చెందారు. మూసి ఉన్న దుకాణాలపై దాడి చేశారు. దుకాణాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రైతులపై లాఠీఛార్జీ చేశారు. పోలీసుల లాఠీఛార్జితో రైతులు కకావికలయ్యారు.
డబ్బు చెల్లించాల్సిన విత్తనవ్యాపారులు సోమవారం దుకాణాలు తెరవలేదు. దీనితో ఆశాభంగంచెందిన రైతులు అక్కడే బైఠాయించారు. డబ్బువాపస్ చేస్తారని ఆశగా ఇంత దూరం వచ్చామని,డబ్బు అందేవరకు ఇక్కడినుంచి కదిలేదిలేదని రైతులు అంటున్నారు. పరిస్థితి క్రమంగాఉద్రిక్తంగా మారడంతో వరంగల్ అడిషనల్ ఎస్పీవెంకటరావు, టౌన్ డీఏస్పీ సుమతి, ఆర్డీవో సుధాకరరావు,వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మోహనరావుస్టేషన్ రోడ్డుకు చేరుకుని పరిస్ధితినిసమీక్షించారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకునివ్యాపారులు రైతులకు డబ్బు చెల్లించేలా చూస్తే గానీ ఉద్రిక్త పరిస్ధితిసద్దుమణిగేలా లేదు.