వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీవో 610 అమలుపై విపక్షాల ధ్వజం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: 610 జివోపై సభా సంఘం మధ్యంతర నివేదిక అమలు తీరుపై ప్రతిపక్షాలు తెలుగుదేశం ప్రభుత్వంమీద ధ్వజమెత్తారు. మధ్యంతర నివేదిక అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ప్రతిపక్షాలు అభిప్రాయపడ్డాయి.

610 జీవో స్ఫూర్తికి విరుద్ధంగా ఉద్యోగాల్లో అధికంగా స్థానికేతరులను వెనక్కి పంపేవిషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ప్రతిపక్షాలు అన్నాయి. మూడు శాఖల్లోని స్థానికేతరులను వెనక్కి పంపడానికిఅంగీకరించిన ప్రభుత్వం పోలీసు శాఖలో అధికంగా ఉన్న 360 మందిని వెనక్కి పంపడంలో చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని ప్రతిపక్షాల నాయకులన్నారు. ఈవిషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని ప్రభుత్వం నిర్ణయించిందని సబాసంఘం చైర్మన్‌ రేవూరి ప్రకాశ్‌ రెడ్డి చెప్పారు. ఈవిషయంలో ప్రభుత్వ వైఖరిపై కె. చంద్రశేఖర్‌ రావు (టిఆర్‌ఎస్‌), ఇంద్రకరణ్‌రెడ్డి(కాంగ్రెస్‌), నోముల నరసింహయ్య (సిపిఎం) విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X