వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కావలి సిఐ సస్పెన్షన్
హైదరాబాద్ఃజర్నలిస్టులపై దౌర్జన్యం చేసిన నెల్లూరు జిల్లా కావలి పట్టణ పోలీసు ఇన్స్పెక్టర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.డీఎస్పీ సస్పెన్షన్ కు సిఫార్సు చేస్తూ డిజిపికార్యాలయానికి లేఖ రాశారు. తస్లిమా బానుది హత్యేనని టీవీ ఛానళ్ళు, పత్రికలు కొన్నివాస్తవాలను వెలికి తీయడంతో కావలి పోలీసులుజర్నలిస్టులపై కక్ష పెంచుకున్నారు.
తస్లిమా బాను హంతకులను శిక్షించాలనికావలిలో ప్రగతి శీల ప్రజాసంఘాలు నిర్వహించిన సభను కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులపై సిఐ నాయకత్వంలో పోలీసులు దౌర్జన్యం చేశారు. విచక్షణ రహితంగా కొట్టారు. ఈ సంఘటనపై జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టరుకు, డిఐజికి జర్నలిస్టు సంఘాలు నివేదించాయి.
Story first published: Monday, June 30, 2003, 23:53 [IST]