అయోధ్యలో మసీదుకు విహెచ్పి షరతు
నాగపూర్: అయోధ్యలోని రామాలయం చుట్టుపక్కల 28 మైళ్ల పరిధిలో ఎక్కడ మసీదు నిర్మాణాన్నిఅంగీకరించబోమని విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి) ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తొగాడియా అన్నారు.
తాము మూడు అంశాలకు కట్టుబడి ఉంటామని, అయోధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయ నిర్మాణం జరగడానికి, బేషరతు చర్చలను లేదా సంప్రదింపులను ఆహ్వానించడానికి, అయోధ్యలోని ఆలయానికి చుట్టుపక్కల 28 మైళ్ల పరిధిలో మసీదు ఉండకూడదనే మూడుఅంశాలకు తాము కట్టుబడి ఉంటామని ఆయన సోమవారంవిలేకరుల సమావేశంలో వివరించారు. ఛాందస ముస్లింలతో, వ్యక్తులతో, సంస్థలతో చర్చలకు తాము సిద్ధంగా లేమని, ఛాందసవాదులకు మాట్లాడేందుకువీటో లేదని ఆయన అన్నారు. రామాలయ నిర్మాణానికి పార్లమెంటు చట్టం రూపొందించేందుకు మద్దతు కూడగడుతామని ఆయన చెప్పారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించేందుకు, ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు విహెచ్పి మత నేతల ఉన్నత స్థాయి సమావేశం జులై 11వ తేదీన ఢిల్లీలో జరుగుతుంది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించి ఈ సమావేశం నిర్ణయాత్మకం కాగలదని తొగాడియా అన్నారు.