వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైతులకు చంద్రబాబు కొత్త పరిష్కారం
ఖమ్మం: 19వ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల కోసం కొత్త పథకాన్ని ప్రకటించారు. ఈ పథకంపేరు పరిష్కారం. రైతుల కోసం ఒక హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు. రైతులు ఈ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియచేస్తే అధికారులు వాటిని నోట్ చేసుకొని వెంటనే స్పందిస్తారు.
విత్తనాల పంపిణీతో పాటు, రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ హెల్ప్ లైన్ ద్వారా పొందవచ్చు. ఇదే పరిష్కారం. విత్తనాల కోసం రైతులు ఎగబడకుండా అన్ని ప్రాంతాల్లో విత్తనాలను భారీ ఎత్తునఅందుబాటులో ఉంచామని ముఖ్యమంత్రి తెలిపారు. ఒకవేళ కొరత ఉన్న ప్రాంతాల్లో కొద్ది సమయం అనంతరం ప్రత్యామ్నాయ విత్తనాలను జారీచేస్తామన్నారు.
Comments
Story first published: Tuesday, July 1, 2003, 23:53 [IST]