వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
19వ విడత జన్మభూమి ప్రారంభం
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 19వ విడత మహిళా, రైతు జన్మభూమి ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖమ్మం జిల్లాల్లో మంగళవారం ఉదయం జన్మభూమిని ప్రారంభించారు. మహానాడులో ప్రకటించిన కోటివరాల పథకం లబ్దిదారుల ఎంపికను కూడా ఆయన ఆరంభించారు.
హైదరాబాద్లో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,విజయరామారావు జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలు మంచినీటి గురించి మంత్రులకు ఫిర్యాదు చేశారు. తమ ప్రాంతంలో మరుగుదొడ్లు లేవని కొన్ని ప్రాంతాల ప్రజలు చెప్పుకున్నారు. తెల్లరేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.
పాౖత హామీల అమలుపై జన్మభూమిలో నిలదీయాలని కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు కొన్ని చోట్ల జన్మభూమిని అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి.
Comments
Story first published: Tuesday, July 1, 2003, 23:53 [IST]