అయోధ్య: పీవీని సమర్ధించిన కేంద్రం
న్యూఢిల్లీ: అయోధ్యపైకేంద్రం తన మాట మార్చింది. వివాదస్పద అయోధ్య కట్టడం పరిరక్షణచర్యల్లో భాగంగా రాష్ట్రపతి పాలన విధించిరాదనిఅప్పటి పీవీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నికేంద్రం లిబర్ హాన్ కమీషన్ ముందుసమర్ధించింది. మంగళవారం లిబర్ హాన్కమీషన్ ముందు కేంద్ర తరఫు న్యాయవాది లాలారామ్ గుప్తా వాదన వినిపించారు. అప్పటి పీవీప్రభుత్వంగానీ, యూపీ ప్రభుత్వం గానీ కట్టడంకూల్చివేతను ముందు ఊహించలేదనిఆయన తెలిపారు.
డిసెంబర్ 6 (1992) నాటిమధ్యాహ్నం వరకు అక్కడ పరిస్థితిసవ్యంగానే ఉందని, రాజ్యంగ యంత్రాంగం విఫలమైనదాఖలలు ఏవీ లేవని స్పష్టం చేశారు. గత నెల 13నకేంద్రం చేసిన వాదనకు మంగళవారం నాటివాదన పూర్తి భిన్నం కావడం విశేషం. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం,పీవీ ప్రభుత్వాల వైఫల్యం వల్లే కట్టడంకూలిందని ఇప్పటివరకు కేంద్రం చెపుతూవచ్చింది. మరోవైపు, అయోధ్యలో తవ్వకాలు జరుపుతోన్న పురావస్తు శాఖమరో నెలల గడువు కోరింది. తవ్వకాలు పూర్తిచేసి, నివేదిక సమర్పించేందుకు మరో నెలలసమయం పడుతుందని ఆ శాఖ అలహాబాద్ న్యాయస్థానానికిచెందిన లక్నో బెంచ్ ను కోరింది.