రైల్వేశాఖ తీరుపై మండిపడ్డ సీఎం
వరంగల్: ఎన్ని దుర్ఘటనలు జరిగినా,రైల్వే శాఖ తీరు మార్చుకోవడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రమాదంపైవిచారణలు జరిపినా వాటిని అమలుచేయడం మర్చిపోతారని ఆయనవిమర్శించారు. బుధవారం మధ్యాహ్నం ఆయన వరంగల్ ప్రమాద స్థలికి హెలికాప్టర్ లో చేరుకున్నారు.
ప్రమాదం జరిగిన తీరు గురించిరైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల బంధువలందర్నీ కలిసి ఓదార్చారు. గాయపడిని వారు చికిత్స పొందుతున్న ఎంజిఎం ఆసుపత్రిని సందర్శించి వారిని పరామర్శించారు.ఎక్స్ గ్రేషియా విషయమై ప్రధానితో చర్చించాక ప్రకటిస్తామని ముఖ్యమంత్రివిలేకరులకు చెప్పారు. పూర్తి స్థాయి విచారణ తర్వాతే ప్రమాదానికి కారణాలు చెప్పగలమన్నారు.
డ్రైవర్
వైఫల్యం:
నితీష్
మరోవైపు
దుర్ఘటనకు
కారణం
డ్రైవర్
నిర్లక్ష్యమేననిరైల్వేమంత్రి
నితీష్
కుమార్
పేర్కొన్నారు.
డ్రైవర్
సిగ్నల్
ను
పట్టించుకోకుండా
నడపడం
వల్లేరైలు
పట్టాలు
తప్పిందని
వివరించారు.